సినిమా ప్రపంచం
సినిమా రివ్యూలు
అర్థంకాని కథతో ఆకట్టుకోని 'మిత్రుడు' | అర్థంకాని కథతో ఆకట్టుకోని 'మిత్రుడు' |
|
|
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రియమణి, రంగనాథ్, చంద్రమోహన్, దీపక్, కృష్ణభగవాన్, ప్రదీప్ రావత్, బాలయ్య, బ్రహ్మానందం, హేమ, చలపతిరావు తదితరులు. సాంకేతికవర్గం: సంగీతం- మణివర్మ, నిర్మాత- శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకుడు- మహాదేవ్. పాయింట్: జాతకం కంటే విల్పవర్ గొప్పదని చెప్పే పాయింట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం చూశాక దీనికి మిత్రుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఏమాత్రం కథాబలంలేకుండా సాగదీతగా సాగే ఈ చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ నటించిన కలియుగ పురుషుడును గుర్తుకు తెస్తుంది. జాతక బలంపై ఇప్పటికే చాలా చిత్రాలూ రాగా తాజాగా అదే పాయింట్తో వచ్చిన మిత్రుడు చిత్రం నేటి ట్రెండ్కు తగినట్లుగా లేకపోవడం గమనార్హం. కథ: మలేషియాలో ఉంటున్న ఆదిత్య (బాలకృష్ణ), తన వారినందరినీ పోగొట్టుకున్న దుఃఖంలో మందుకు బానిసగా మారుతాడు. ఇలాంటి వ్యక్తిని అక్కడే చదువుతున్న ఇందు (ప్రియమణి) బలవంతంగా ప్రేమిస్తుంది. దానికీ ఓ కారణముంటుంది. తన జాతకచక్రం ప్రకారం మొదటి మొగుడు చనిపోతాడు కాబట్టి ఎలాగూ జీవితంపై విరక్తి కలిగిన ఆదిత్యను ట్రాప్చేసి పెళ్ళి చేసుకుని ఆ తర్వాత తనకు పరిచయమున్న మధు (దీపక్)ను ఎంచక్కా పెండ్లిచేసుకోవచ్చునన్నది ప్రియామణి ప్లాన్. ఈ విషయాన్ని తన నాన్న రంగనాథ్కు కూడా చెప్పకుండానే ఆదిత్యను పెళ్లి చేసుకుంటుంది ఇందు. పెళ్ళయిన తర్వాత మధుతో ఇండియా బయలుదేరుతుంది ఇందు. అయితే ఈ విషయాన్ని తెల్సుకున్న ఆదిత్య వారితోనే ఇండియాకు వచ్చి వారికి షాక్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి రకరకాల ట్విస్ట్లతో కథ సాగుతుంది. ఇలాంటి తరుణంలో అనాధగా మిగిలిన ఆదిత్యను అల్లుడిగా ససేమిరా అంటాడు రంగనాథ్. | ||||
| (మూలం - వెబ్దునియా) | ||||
| < Prev | Next > |
|---|