TeluguNews.Net

    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
               No account yet?
               No account yet?
    Text size:
  • Increase font size
  • Decrease font size
  • Default font size
హొం పేజి arrow ప్రముఖ వార్తలు arrow జాతీయ౦ arrow పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం
పదవుల కోసం పోరాటం: 22న కొత్త ప్రభుత్వం Print E-mail
కేంద్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానాల కోసం దాని భాగస్వామ్య పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. యూపీఏ భాగస్వామ్య పక్షాల చర్చలు బుధవారం పదవుల చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ వరుసగా రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం 322 మంది ఎంపీల మద్దతులో ఈసారి ప్రభుత్వం కొలువుతీరబోతుంది. యూపీఏ కూటమికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ), ఆర్జేడీ, బీఎస్పీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరేందుకు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కులుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ నూతన ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్‌ను నియమించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఆయనకు అందజేశారు. దీంతో తన మంత్రిమండలి సభ్యులతో ప్రధాని మన్మోహన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసారి కేంద్రంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో కాంగ్రెస్ నేతలు సింహభాగాన్ని దక్కించుకోనున్నారు. అంతేకాకుండా ప్రధాన మంత్రివర్గ పదవులను కూడా వారి వద్దే ఉంచుకునే అవకాశముంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 200లకుపైగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)

< Prev   Next >

Google