|
ఒరిస్సా సీఎంగా నవీన్ ప్రమాణస్వీకారం |
|
|
|
|
బిజు జనతాదళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ గురువారం ఒరిస్సా ముఖ్యమంత్రి తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లు గెలుచుకొని బీజేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒరిస్సా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో దాదాపుగా మూడో వంతు స్థానాలు కైవసం చేసుకొని బీజేడీ అఖండ విజయం సాధించింది.
నవీన్ పట్నాయక్ గవర్నర్ ఎంసీ భండారేను బుధవారం సాయంత్రం కలుసుకున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. అనంతరం గురువారం ఉదయం 11. 30 గంటలకు రాజ్భవన్లో జరిగిన వేడుకలో నవీన్ పట్నాయక్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
|
| (మూలం - వెబ్దునియా) |